స్వామీజీ మాటలు విని 23 ఏళ్లుగా జుట్టు పెంచుతున్నాడు.. ఆఖరికి ఏం జరిగిందంటే..!!

-

స్వామీజీలు, బాబాలు చెప్పే మాటాలను చాలామంది బలంగా నమ్ముతారు.. వాళ్లు అన్నరాంటే అయిపోతుందనుకుంటారు. అలాగే ఓ స్వామీజీ చెప్పిన మాటను నమ్మిన ఓ వ్యక్తి చాలా పెద్ద పనే చేశాడు. ఏకంగా 23 ఏళ్ల నుంచి జుట్టు కత్తిరించకుండా పెంచుతున్నాడు. లక్షకు పైగానే ఖర్చు చేశాడు.. అతని జుట్టు ఇప్పుడు 5 అడుగుల పైనే ఉంది.. ఇప్పుడు ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఎవరా స్వామీజీ, ఏంటా కథా చూద్దామా..
రాజస్థాన్‌లోని రతన్ గఢ్ జిల్లాలో 23 ఏళ్ళ క్రితం ఒక కార్యక్రమం జరిగింది. రతన్ గఢ్ జిల్లాలో రామ్ సుఖ్ దాస్ మహారాజ్ అనే వ్యక్తి వచ్చి గ్రామస్తులతో కలిసి సమావేశం నిర్వహించారు. అనేక అంశాలపై ఆయన చర్చించారు. ఈ క్రమంలో ఆయన సమావేశానికి అనేక మంది స్థానికులు హజరయ్యారు. ఆ సమావేశానికి హుద్దెరా గ్రామానికి చెందిన గోపాల్ రామ్ ప్రజాపత్ అనే వ్యక్తి కూడా హజరయ్యాడు. అతను టైలరింగ్ చేస్తుంటాడు.. ఈ క్రమంలోనే రామ్ సుఖ్ దాస్.. వెంట్రుకలు పెంచుకోవడం వలన ఎన్నో ఉపయోగాలున్నాయని, ప్రతిరోజు వెంట్రుకలను అల్లడం వలన ఎన్నో లాభాలున్నాయని అన్నారు.
ఈ మాటలకు గోపాల్ రామ్ బాగా నమ్మాడు. ఆయన తాను కూడా తన జుట్టును పెంచుకోవాలని ఫిక్స్‌ అయ్యాడు. అప్పటి నుంచి అంతే.. 23 ఏళ్లుగా జుట్టును పెంచడం ప్రారంభించాడు. ప్రస్తుతం జుట్టు.. 5 అడుగుల 2 అంగుళాల పొడవు పెరిగింది. గోపాల్ రామ్ జుట్టును చూడటానికి చుట్టుపక్కల గ్రామాస్థులు కూడా వస్తుంటారు. జుట్టు బలంగా పెరగడానికి నెలకు 500 రూపాయలు ఖర్చవుతుందని ఆయన తెలిపాడు.
అంతే కాకుండా ఇప్పటిదాక సుమారు సుమారు లక్షా 40 వేల రూపాయల వరకూ ఖర్చుపెట్టాడని అతను వెల్లడించాడు. అయితే.. జుట్టు కోసం ప్రతివారంలో ఒక రోజు ముల్తానీ మిట్టి పెడతానని, అదే విధంగా వేప నీళ్లతో కూడా కడుగుతానని తెలిపాడు. ప్రస్తుతం.. జుట్టు జడల మాదిరిగా పెద్దదిగా మారిందని, దీని వల్ల కనీసం సరిగ్గా నిద్రకూడా పోవట్లేదని ఆయన అన్నారు. బైక్ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ కూడా పెట్టుకొవడానికి ఇబ్బందికరంగా మారిందని ఆయన తెలిపారు. ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించడం తన టార్గెట్ అన్ని గోపాల్ రామ్ అన్నారు. ఏంటో ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి.. ఉన్న ఒక్క జీవితాన్ని ఇన్ని ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నాడా వ్యక్తి..!!

Read more RELATED
Recommended to you

Latest news