1991లో రూ. 100 లంచం తీసుకున్నందుకు 2023లో శిక్ష.. పాపం అతని వయసు ఇప్పుడు..

-

లంచాలు తీసుకోవడం ఈరోజుల్లో చాలామందికి అలవాటుగా మారింది.. మన కూడా 100, 200 అయితే చూసిచూడనట్లు వదిలేస్తాం.. పెద్ద మొత్తంలో ఇవ్వాల్సి వచ్చినప్పుడే ఏదో ఒకటి చేస్తుంటాం.. 1991లో రూ. 100 లంచం తీసుకున్న రైల్వే హెడ్ క్లర్క్‌కు ఇప్పుడు శిక్ష పడింది.. ఏడాది పాటు జైలు శిక్ష, రూ.15 వేలు కట్టాల్సిందిగా సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది.. ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో తెలుసా..। లక్నోలో లంచం తీసుకున్న వ్యవహారంలో వచ్చిన ఈ తీర్పు ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది.32 ఏళ్ల క్రితం 100 రూపాయలు లంచం తీసుకున్న కేసులో నిందితుడైన రైల్వే హెడ్ క్లర్క్‌ను సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో అతడు సంవత్సరం జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. శిక్షతో పాటు సీబీఐ అవినీతి నిరోధక చట్టం ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ విక్రమ్ సింగ్ దోషికి రూ.15,000 జరిమానా కూడా విధించారు. శిక్ష పడిన వ్యక్తి వయస్సు ఇప్పుడు 89 సంవత్సరాలు. ఈ మొత్తం కేసులో నిందితుడిపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా మృతి చెందాడు.
సీబీఐ తరపు న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం.. అలంబాగ్ లోకో ఫోర్‌మెన్ కార్యాలయంలో లోకో పైలట్‌గా పనిచేస్తున్న రామ్ తివారీ తన పెన్షన్‌ విషయంలో ఇబ్బంది పెడుతున్న వ్యక్తిపై 1991 ఆగస్టు 6న ఎస్పీ సీబీఐకి(CBI) ఫిర్యాదు చేశారు. దీని కోసం మళ్లీ వైద్యం చేయాల్సి వచ్చింది.
దీని కోసం అతడు 19 జూలై 1991న నార్తర్న్ రైల్వే హాస్పిటల్‌లో హెడ్ క్లర్క్ RN వర్మను కలిశాడు. త్వరగా వైద్యం చేయించాలంటూ ఆర్‌ఎన్‌ వర్మ తన నుంచి రూ.150 లంచం డిమాండ్‌ చేశాడు. మళ్లీ 1991 ఆగస్టు 5న మెడికల్ కోసం రైల్వే ఆస్పత్రికి వెళ్లినప్పుడు 150 రూపాయలు ఇచ్చే వరకు పని జరగదని ఆర్.ఎన్.వర్మ చెప్పారు. ఆ సమయంలో లోకో పైలట్ రామ్‌కుమార్ ఎలాగోలా రూ.50 ఏర్పాటు చేసి అతనికి ఇచ్చాడు. ఫిర్యాదుదారు చాలా పేదవాడు. ఎలాగోలా 50 రూపాయలు ఇచ్చాడు. అయితే 100 రూపాయలు చెల్లించకుండా సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిందితుడు ఒప్పుకోలేదు..దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితుడు రామ్‌కుమార్ తివారీ ఈ విషయంపై సీబీఐ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశాడు. పోలీసు సూపరింటెండెంట్ తరపున ఫిర్యాదుదారు రామ్‌కుమార్ తివారీకి 50-50 రూపాయల రెండు నోట్లు ఇచ్చారు. లంచం కోరిన RN వర్మను సమీపంలోని ధాబాకు పిలిపించమని అడిగారు. దాబా వద్ద ఆర్‌ఎన్‌ వర్మ లంచం తీసుకుంటుండగా సీబీఐ బృందం అక్కడికక్కడే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.
ఇన్ని సంవత్సరాలుగా కోర్టులో కేసు నడుస్తుండటం, ఎప్పటికప్పుడు కేసు వాయిదా పడుతూ ఉంది. ఈ క్రమంలోనే.. ఫిర్యాదుదారుడు మరణించాడు. ఇది మాత్రమే కాదు, ఈ వయస్సులో నిందితుడు ఈ వ్యవహారాన్ని త్వరగా పరిష్కరించాలని హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై 6 నెలల్లోగా కేసును పరిష్కరించి కేసును ముగించాలని సీబీఐ ప్రత్యేక కోర్టును హైకోర్టు ఆదేశించింది. నిందితుడి వయస్సు అతని నుంచి రికవరీ చేసిన లంచం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే అది పెద్ద కేసు కాదని సీబీఐ కోర్టు తరఫున తన తీర్పులో పేర్కొంది. అయితే 32 ఏళ్ల క్రితం రూ.100 నిరుపేదలకు చాలా ఎక్కువ. 382 రూపాయలు మాత్రమే పింఛను పొందేవారు. నిందితుడు చేసిన పనికి శిక్ష పడకపోతే సమాజంలో దుష్పరిణామాలు తప్పవని కోర్టు పేర్కొంది.
ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది అని ఈ కేసు ద్వారా మరోసారి రుజువైంది.. అయితే ఇలా వందలే కాదు.. కోట్లు మింగేసిన తిమింగళాలు ఉన్నారు ఈ దేశంలో..వారికి ఎన్నాళ్లకు శిక్ష వేస్తారో..!

Read more RELATED
Recommended to you

Latest news