కవల పిల్లలే కాదు, మార్కులు కూడా సేమ్, ఇద్దరికీ ఒకే శాతం మార్కులు…!

-

కవల పిల్లలు అంటే రూపం మాత్రమే ఒక రకంగా ఉంటుంది… మహా అంటే మాట ఒకే రకంగా ఉంటుంది. వాళ్ళ నడవడిక అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఇప్పటి వరకు మనం చూసింది ఇదే. కాని ఇద్దరు పిల్లలు మాత్రం మార్కులు కూడా ఒకే విధంగా సాధించారు. ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడా పరిధిలో నివాసం ఉండే మాన్య మానసీ ఈ విధంగా సాధించారు.

గ్రేటర్ నోయిడాకు చెందిన ఈ ఇద్దరూ… సిబిఎస్‌ఇ 12 వ తరగతి పరీక్షల్లో మొత్తం ఐదు సబ్జెక్టులలో ఒకే శాతం మార్కులు సాధించారు. ఇద్దరికీ కూడా 95.8 శాతం మార్కులు వచ్చాయి. మాన్సీ సింగ్ మాట్లాడుతూ “ఇది ఆశ్చర్యం కలిగించిందని చెప్పుకొచ్చింది. మేము మంచి మార్కులు ఆశించాము కాని ఇలా కాదని ఆమె చెప్పింది. తాము ఇంజనీరింగ్ చెయ్యాలని భావిస్తున్నట్టు ఆమె మీడియాకు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news