అదో మృత్యు కొలను..దిగితే చావడం పక్కా.. కానీ మృతదేహం మాత్రం చెక్కుచెదరదు..

-

మనం అప్పుడప్పుడు వినే ఉంటాం.. అక్కడకు వెళ్లిన వారు ఎవరూ సజీవంగా తిరిగి రాలేదు.. అందులో దెయ్యాలు ఉన్నాయి.. ఆ బావిలోంచి అరుపులు వినిపిస్తాయి.. ఆ మార్గంగుండా రాత్రిపూట వెళ్తే ప్రమాదాలు జరుగుతాయి ఇలా.. ఇలాంటిదే ఇప్పుడు చెప్పుకుబోయే స్టోరీ కూడా.. ఈ కొలనులో ఈతకు కెళ్లిన వారెవ్వరూ ఇంత వరకు బతికి బట్టకట్టలేదట. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమండీ. దీనిని ‘పూల్ ఆఫ్ డెత్’ అని పిలుస్తారు.

ఎర్ర సముద్రం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఉప్పగా ఉండే సముద్రం అని కూడా అంటారు. మియామీ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టుల బృందం ఈ సముద్రంలో దాదాపు 1,770 మీటర్ల లోతులో ‘పూల్ ఆఫ్ డెత్’ గుర్తించారు. ఈ కొలనులోకి ప్రవేశించిన ఏ జీవి కూడా ఇప్పటి వరకు సజీవంగా తిరిగి రాలేదట.. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ మృత్యు కొలను సౌదీ అరేబియా తీరానికి 5,800 అడుగుల దూరంలో ఉంది.

దాని పరిసర ప్రాంతం కూడా చాలా దారుణంగా ఉంటుందని వారి తెలిపారు.. అక్కడికి వెళ్లే ఏ జీవి కూడా బతకదని శాస్త్రవేత్తలు సైతం వెల్లడించారు.. ముఖ్యంగా ఈ కొలనులో నీరు తాగినా మృత్యువు తప్పదు. ఈ కొలనులోని నీరు చాలా ప్రమాదకరమైనది.

కారణం ఏంటంటే..

ఓ పరిశోధన ప్రకారం.. ఈ కొలనులో ఆక్సిజన్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి ఇతర విష రసాయనాలు కూడా ఈ నీటిలో ఉన్నాయి. అంతేకాకుండా ఈ కొలను నీటిలో సాధారణ సముద్రం నీటి కంటే 7-8 రెట్లు ఉప్పు అధికంగా ఉందని, అందువల్లనే ఏ జీవి దానిలోకి వెళ్లినా చనిపోతుందని తేలింది. ఈ కొలనులో చనిపోయిన ఏ జీవి అయినా చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. ఎందుకంటే.. ఇక్కడి నీరు ఉప్పగా ఉండటం వల్ల ప్రిజర్వేటివ్‌లుగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు.

సో అలా ఆ కొలను అంత ప్రమాదకరంగా ఉంది. విషయం తెలిసింది కాబట్టి ఎవరూ వెళ్లడానికి ధైర్యం చేయరు. అయితే మీరు ఎప్పుడైనా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఈతొచ్చుకదా అని ఎందులో పడితే అందులో దూకేయకండి.. ఆ నీళ్లు ఎలాంటివో, ఆ కథేంటో స్థానికులను అడిగి తెలుసుకున్నాకే దిగడం ఉత్తమం..!
Attachments area

Read more RELATED
Recommended to you

Latest news