అక్కడ 2.2 కిలోమీటర్ల మేర మృతదేహాలతో గోడకట్టారు.. చూసేందుకు జనాలు క్యూ కట్టారు..!

-

ప్యారీస్ అంటేనే మంచి‌ టూరిస్ట్‌ స్పాట్‌.. ఎన్నో అందమైన ప్రదేశాలు ఉంటాయని తెలుసు కానీ వణుకుపుట్టించే మిస్టరీస్ ఉన్నాయమి మీకు తెలుసా..60లక్షల మృతదేహాలను భద్రపరిచిన మ్యూజియం ఒకటుంది. దీని వెనుక పెద్ద కథే ఉందట. అదేంటో ఇప్పుడు చూద్దాం.

‘ప్యారీస్‌ కాటకోంబ్స్‌’ పేరు ఎప్పుడైన విన్నారా? అందులో దాదాపు 60 లక్షల మృతదేహాలను భద్రపరిచిన మ్యూజియం ఉంది. దీనికి సంబంధించిన చరిత్ర 18వ శతాబ్ధంలోని చివరి భాగం నుంచి ప్రారంభమైందట. చనిపోయినవారిని పాతిపెట్టడానికి నగరంలో ఖాళీ స్థలం కూడా లేని కాలంలో దీనిని నిర్మించారట. 1785లో మరే ఇతర శ్మశానవాటికల్లో అంత్యక్రియలు చేయలేనంతగా మరణాలు సంభవించాయి. వర్షం కురవడంతో శ్మశానవాటికల నుంచి ఒక్కసారిగా శవాలు వీధుల్లోకి చొచ్చుకువచ్చాయట.మై గాడ్ ఇమాజిన్ చేసుకోండి.. అలా మృదేహాలను కొట్టుకుంచి ఇంటిముందు పడితే..మన పరిస్థితి ఏంటి.. భయంతో ఊపిరిఅక్కడే ఆగిపోదు.. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి మృతదేహాలను సున్నపు గనుల సొరంగంలో పడవేశారట. ఇతర ప్రాంతాల నుండి కూడా మృతదేహాలను తీసుకువచ్చి ఇక్కడ పడవేశారు. అనతికాలంలోనే దాదాపు 60 లక్షల మృతదేహాలు ఇక్కడ నిక్షిప్తమయ్యాయి.

ఆ తర్వాత ఈ మృతదేహాల ఎముకలు, పుర్రెలతో సుమారు 2.2 కిలోమీటర్ల పొడవైన గోడను నిర్మించి మ్యూజియంగా మార్చారు. ఈ గోడను భూమిలోపల 20 మీటర్ల లోతులో నుంచి కట్టినట్లు చెబుతుంటారు. అందుకే ఈ స్థలాన్ని ‘సమాధుల నేలమాళిగ బేస్‌మెంట్‌ ఆఫ్‌ టోంబ్స్‌’ అని పిలుస్తారు. ఇప్పుడు ఇది పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. దీనిని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారంటే విజువల్ ఏ రేంజ్ లో ఉంటుందో ఇక.

 The Paris Catacombs

చనిపోయినవారి ఎముకలు, పుర్రెలతో నిర్మించిన 2.2 కి.మీ పొడవున్న ఈ మొత్తం గోడ దాదాపు 800 హెక్టార్లలో విస్తరించి ఉందట . అయితే ఈ మొత్తం చూడటానికి పర్యటకులకు అనుమతించలేదు. ఈ సొరంగంలోని కొన్ని భాగాలు మాత్రమే చూసేందుకు అనుమతి ఉంది. ఏదిఏమైనప్పటికీ సమాధులను చూస్తేనే భయమేస్తుంది. అలాంటిది ఏకంగా అస్థిపంజరాలతో కట్టిన ఈ గోడను చూడటానికి అన్ని వేల మంది ఎలా వెళ్తున్నారో ఏంటో..ఒకవేళ గోడమొత్తం చూడ్డానికి అనుమతి ఇస్తే అంత గోడను చూసేసరికి ఇక్కడ మనిషి హాట్ బీట్ ఏ రేంజ్ లో ఉంటుందో.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news