24 గంటల వ్యవధిలో రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న అమ్మాయి…!

-

ఈ మధ్య కొన్ని కొన్ని వివాహాల అనంతరం జరుగుతున్న సంఘటనలు సంచలనంగా మారాయి. పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకున్న అమ్మాయి ఉంటుందా లేదా అబ్బాయి ఉంటాడా లేదా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. తాజాగా తమిళనాడులో ఒక ఘటన జరిగింది. పెళ్లి అయిన తర్వాతి రోజే ఒక అమ్మాయి ప్రియుడి తో కలిసి వెళ్ళిపోయింది. అతనిని కూడా వివాహం చేసుకుని పోలీసుల వద్దకు వచ్చింది. సేలం జిల్లా సెంగవల్లి నడువలూరుకు చెందిన పెరియస్వామి కుమారుడు రవికుమార్‌ వరి కోత యంత్రం డ్రైవర్‌ గా పని చేస్తున్నాడు.

అతనికి చిన్నమసముద్రానికి చెందిన పూమారై కుమార్తె సత్యతో ఇటీవల వివాహం నిశ్చయించారు. వీరి వివాహం ఈ నెల 4 న జరిగింది. 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు దుకాణానికి వెళ్తా అని చెప్పి సత్య బయటకు వెళ్ళింది. ఆ తర్వాత ఆమె ఇంకా కనపడలేదు. వెంటనే ఆమెను వివాహం చేసుకున్న రవికుమార్‌ సెంగవల్లి మహిళా పోలీస్‌స్టేషన్‌లో భార్య కనపడటం లేదు అని ఫిర్యాదు చేసాడు. ఈ తరుణంలో సత్య షాక్ ఇచ్చింది. చిన్నసముద్రానికి చెందిన వల్లరసు అనే వ్యక్తిని వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక తమకు రక్షణ కల్పించాలి అంటూ ఆమె ఆత్తూర్‌ పోలీసులను ఆశ్రయించడంతో అందరూ షాక్ అయ్యారు. తాము రెండేళ్ళు గా ప్రేమించుకుంటున్నాం అని అందుకే వివాహం చేసుకున్నామని పేర్కొంది. ఇక రవి కుమార్ ని వివాహం చేసుకున్న తర్వాత వారి ఇంటి వారు పెట్టిన నగదు నగలను ఇచ్చేసింది. పెళ్ళికి అయిన ఖర్చుని కూడా ఇవ్వాలి అని డిమాండ్ చేసాడు రవి కుమార్. వాటిని కూడా ఇచ్చేస్తా అని చెప్పింది ఆమె.

Read more RELATED
Recommended to you

Latest news