ఎస్పీ బాలు అరోగంపై స్పందిన తమన్..!

-

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య ‌ప‌రిస్థితి విషమంగా మారిందని గురువారం రాత్రి ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు, అభిమానులు ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు.

ఈ సందేశంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం భగవంతుడిని ప్రార్థించాలని, ఈ సమయంలో అందరి ప్రార్థనలు ఆయనకు అవసరమని, బాలు త్వరగా కోలుకోవాలని సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ ట్వీట్ చేశారు. తమన్ ఓ వీడియోను కూడా పెట్టారు. ఆ వీడియోలో బాలు, కోటి, మణిశర్మ, శివమణి, తమన్ తదితరులు ఉన్నారు. లాక్‌డౌన్‌కు ముందు మార్చిలో నా మామ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఉన్న వీడియో. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే నాకు కన్నీరు ఆగడం లేదు. మామా.. దయచేసి ఆరోగ్యంగా తిరిగి రండి. బాలుగారి కోసం ప్రార్థన చేద్దాం. నాకు మీ అందరి మద్దతు కావాలి` అని తమన్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news