బ్రేకింగ్….కరోనాకు కొత్త మెడిసిన్ కనిపెట్టిన మంత్రి మల్లారెడ్డి..!

-

trs minister malla reddy
trs minister malla reddy

ఓ పక్క కరోనా విలయతాండవం చేస్తుంటే మరోపక్క మన నేతలు కడుపుబ్బా నవ్విస్తున్నారు. వారి మాటలకు నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. ఒకరు ప్యారాసిటమాల్ వేసుకుంటే కరోనా మాయం అంటారు మరొకరు కరోనా చుట్టం.. వస్తుంది పోతుంది అంటారు..! ఇప్పుడు తెలంగాణ మంత్రి, మల్లారెడ్డి విధ్యాసంస్థల అదినేత మల్లారెడ్డి తమ పార్టీ నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో పాల్గొనండి కరోనాను తరిమికొట్టండి అంటున్నాడు.

అక్కడే ఉన్న విలేకరులు మంత్రి చెప్పిన మాటలు విని అవాక్కయ్యారు.. దానికి సంబంధించిన క్లిప్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వ్యాఖ్యలను నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు. మంత్రి కరోనాకు కొత్త మందు కనిపెట్టారంటూ కామెంట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా తారా స్థాయికి చేరుకుంది కేవలం గత 24 గంటల్లో 542 కేసులు నమోదయ్యాయి నేతలు, మంత్రులు సామాజిక బాధ్యతతో మాట్లాడాలని, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆచితూచి మాట్లాడాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news