కాంగ్రెస్‌ తీరుపై తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్యే హరీశ్‌రావు

-

ప్రచారంలో అబద్ధం.. పాలనలో అసహనం.. ఇదే కాంగ్రెస్‌ పార్టీ తీరు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.ఇవాళ టీఆర్ఎస్ భవన్ లో నల్గొండ లోక్ సభ సమావేశం జరిగింది. ఈ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. కష్టపడేవారికి బీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు.

నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశం స్ఫూర్తినిచ్చేలా జరిగిందన్నారు.కాంగ్రెస్‌ మెడలు వంచాలంటే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని కోరారు . పార్టీ బలోపేతం కోసం తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు.లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎన్నికల నోటిఫికేషన్ ముందే అమలు చేసేల ప్రజల తరఫున పోరాడాలని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news