జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను కలిసిన వైఎస్ షర్మిల….

-

ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు.తన కొడుకు వివాహానికి రావాలని పవన్‌ కల్యాణ్‌ ఆహ్వానించారు. షర్మిల పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వెళ్లి తన కొడుకు నిశ్చితార్థం, పెళ్లి ఆహ్వానపత్రిక అందజేశారు. షర్మిల తనయుడు రాజారెడ్డి,ప్రియా అట్లూరికి ఈ నెల 18న నిశ్చితార్థం , ఫిబ్రవరి 17న వివాహం జరుగనున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆమె పలు సిని,రాజకీయ పార్టీల నేతలను కలుస్తూ వివాహ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. తొలికార్డు తండ్రి సమాధి వద్ద పెట్టిన ఆ తర్వాత రెండో కార్డు తన సోదరుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు ఇచ్చి వెళ్లారు. ఆ తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీతో,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు, ప్రముఖులకు షర్మిల ఆహ్వానపత్రికలు అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news