జనసేన మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్ధిని ప్రకటించిన పవన్

-

జనసేన పార్టీ తరుఫున మొట్టమొదటి ఎమ్మెల్యే టికెట్ ను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళ వారం ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా ముమ్మిడివరం శాసన సభ స్థానానికి మాజీ కానిస్టేబుల్  పితాని బాల‌కృష్ణ‌ పేరును పవన్ ఖరారు చేశారు.  హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన రోజే టికెట్ కన్ఫామ్ కావడంతో  ఏపీ రాజకీయాల్లో వేడి రాజుకుంటోంది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన బాల‌కృష్ణ‌ కు జనసేన పార్టీ  నుంచి తొలి బి – ఫారం ను అందిచనున్నట్లు తెలిపారు.

గతంలో వైసీపీలో  టికెట్ ఆశించి భంగ పడ్డ బాల‌కృష్ణ‌ జనసేన నుంచి విజయం సాధిస్తారని జనసేన పార్టీ అధినేత ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news