తెలంగాణలో కేంద్ర మంత్రి పర్యటన

-

భాజపా నేత, కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి జె.పి.నడ్డా సోమ‌వారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. భాజపా  పార్టీ కార్యాలయంలో జరిగే వర్క్‌షాప్‌లో పాల్గొని నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సోమవారం  సాయంత్రం 6 గంటలకు రాజేంద్రనగర్‌లో జరిగే సదస్సుకు నడ్డా హాజరుకానున్నారు. తెలంగాణలో తమ పట్టు పెంచుకునే విధంగా భాజపా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర మంత్రులు, భాజపా నేతలను రాష్ట్రానికి పంపి పార్టీ కేడర్ ని ఉత్సాహపరుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news