ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ) షెడ్యూల్ను గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నట్లు సమాచారం. విజయవాడలోని ఓ హోటల్లో ఉదయం 9గంటలకు షెడ్యూల్ ప్రకటించనున్నట్లు మంత్రి ప్రకటనలో వెల్లడించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల గతంలో ప్రకటిస్తామన్న తారీఖున ఎలాంటి ప్రకటన విడుదల చేయలేకపోయామని మంత్రి తెలిపారు. డీఎస్సీ ప్రకటన శుక్రవారం విడుదల చేయనున్నారు. రెండు నెలల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
నేడు డీఎస్సీ ప్రకటన!
-
Previous article
Next article