పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్

-

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి గవర్నర్ పాతబస్తీలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చార్మినార్ ముందు ఫొటోలు దిగారు.

 

అనంతరం అక్కడి నుంచి లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, సాలార్ జంగ్ మ్యూజియంను సందర్శించారు. గవర్నర్ పర్యటన సందర్భంగా పాతబస్తీ ప్రాంతంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version