పోలవరం ’గ్యాలరీ వాక్’ కు బయలుదేరిన ప్రజాప్రతినిధులు

-

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన గ్యాలరీ వాక్  కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ ప్రజాప్రతినిధులు కొద్ది సేపటి క్రితమే బయలుదేరారు. ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులతో సహా గ్యాలరీ వాక్ చేయనున్నారు. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన అమరావతి ఏసీ బస్సులో ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి పోలవరానికి బయలుదేరారు.

నాడు ఇందిరా గాంధీ…నేడు చంద్రబాబు

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హయాంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కీలకమైన గ్యాలరీ పనులు పూర్తవ్వడంతో నాడు ఇందిరా గ్యాలరీ వాక్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబుకు ఆ అవకాశం దక్కింది. ఇదే విషయాన్ని మంగళవారం అసెంబ్లీలో సీఎం ప్రస్తావించారు.

Read more RELATED
Recommended to you

Latest news