పోలీసుల త్యాగాలు మరువలేనివి…కేసీఆర్

-

తెలంగాణలో పోలీసుల పాత్ర, వారు చేసిన త్యాగాలు ఎన్నటికీ మరువలేమని తెరాస అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం పోలీసులు ఎన్నో త్యాగాలు చేశారని రాష్ట్ర అప‌ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం కోసం పోలీసుల ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. అమరుల కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. అత్యాధునిక ఆయుధాలు, వాహనాలను సమకూర్చామని తెలిపారు. పనిఒత్తిడితో నలిగిపోకుండా వారంతపు సెలవులు సైతం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news