బుర్జ్ ఖలీఫాపై రాముడి చిత్రం….? నెట్టింట్లో వైరల్

-

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి శ్రీరామునీ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయోధ్యలోని రామ మందిరంలో నిన్ను ఘనంగా జరిగింది. ఈ వేడుకలు ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరుపుకున్నారు. అమెరికా,బ్రిటన్, ఆస్ట్రేలియాతో సహా ఇతర దేశాల్లో, ఎన్ఆర్ఐలు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చేతిలో జెండా పట్టుకుని రామ నామాన్ని స్మరిస్తూ ర్యాలీలు నిర్వహించారు.కాగా, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో రాముడి చిత్రం కనిపించే ఒక ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

 

 

అయితే, బాల రాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై రాముడి ప్రతిరూపాన్ని ప్రదర్శించే ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే, ఇంతకీ ఈ చిత్రం నిజమా? లేక ఎడిట్ చేసిన ఫోటోనా అనేది తెలియాల్సి ఉంది. కాగా, దీనిపై విభిన్న కామెంట్స్ వస్తున్నాయి. ఒక వేళ బుర్జ్ ఖలీఫాపై రాముడి ఫోటోను ప్రదర్శిస్తే.. దాని అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఇంస్టాగ్రామ్,ఫేస్ బుక్ లో ఫోటోలను షేర్ చేస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news