బ్రేకింగ్ : వినుకొండలో ఉద్రిక్తత … గాల్లోకి కాల్పులు !

-

ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో ఒక చోట అధికార వైసీపీ మరియు ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్యన వివాదాలు జరుగుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వెళుతుండగా మార్గమధ్యంలో అతని కాన్వాయ్ పై టీడీపీ కార్యకర్తలు సడెన్ గా దాడికి దిగారు. ఈ ఊహించని పరిణామంతో అక్కడ ఉన్న వైసీపీ శ్రేణులు సైతం వారిటిఘో దాడికి దిగగా , ఇరు వర్గాల మధ్యన రాళ్ళూ కర్రలతో పెద్ద స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేయాలని చూసినా ఫలితం రాకపోవడంతో, చేసేది ఏమీ లేక వార్నింగ్ గా గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా ఇప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదని తెలుస్తోంది.

కాగా ఈ దాడి ఘటనలో రెండు పార్టీల కార్యకర్తలకు 15 మందికి గాయాలు అయ్యాయి. మరి ఈ ఘటనలో పోలీసులు ఏ స్టెప్ తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news