మోడీ జీవితకాలం ప్రధానిగా ఉంటారు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు

-

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత పార్లమెంట్ కు ఇవే చివరి ఎన్నికలు అని.. ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశానికి జీవితకాలం ప్రధానిగా ఉంటాడని ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే దేశంలో నియంతృత్వం వస్తుందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే ప్రధాని నరేంద్ర మోడీ నియంతృత్వాన్ని అరికరడదామని తెలిపారు. ఎందుకు ప్రజలు ఇండియా కూటానికి మద్దతుగా నిలవాలని మల్లికార్జున ఖర్గే ప్రజలను కోరారు.

ఒడిస్సా లోని భువనేశ్వర్ లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భారతదేశాన్ని ఏకం చేయడానికి రాహుల్ గాంధీ జూడో న్యాయ యాత్ర చేస్తున్నారు. కానీ బీజేపీ నాయకులు మాత్రం నఫరత్ కి దుకాన్ కు తెరతీశాయని విమర్శించారు. అలాగే ప్రతిపక్ష నాయకులకు ప్రతి ఒక్కరికీ బీజేపీ ప్రభుత్వం ఏది అధికారులతో కలిసి నోటీసులు జారీ చేస్తున్నట్లు గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news