సీబీఐ నూతన డైరెక్టర్ గా తెలంగాణ ఐపీఎస్ అధికారి

-

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నూతన డైరెక్టర్‌ మన్నెం నాగేశ్వరరావు నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వూలు జారీ చేసింది. మంగళవారం అర్థరాత్రి ప్రధాని మోదీ నాగేశ్వరరావుని పిలిపించుకుని మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుతం సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్న ఆయన డీవోపీటో ఉత్తర్వులతో తక్షణమే బాధ్యతలు చేపట్టనున్నారు. వరంగల్‌ జిల్లా నర్సాపూర్‌ కి చెందిన మన్నెం నాగేశ్వరరావు 1986 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారి. సీబీఐ వ్యవహారంలో ప్రధాని స్వయంగా ప్రత్యేక శద్ధ చూపించడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

 

Read more RELATED
Recommended to you

Latest news