తిత్లీ బాధితుల కోసం రాజశేఖర్ సాయం

-

తిత్లీ తుఫాను వల్ల ఏపిలోని శ్రీకాకుళం జిల్లా చాలా వరకు నష్టపోయింది. సిక్కోలు ప్రాంత ప్రజలంతా నిరాశ్రయులుగా మారారు. అయితే ఆపద ఏదైనా సరే ప్రజలకు మేమున్నాం అని సిని సెలబ్రిటీస్ తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ పాతిక లక్షలు, అల్లు అర్జున్ 25 లక్షలు, ఎన్.టి.ఆర్ 15 లక్షలతో పాటుగా కళ్యాణ్ రాం 5, విజయ్ దేవరకొండ 5, కొరటాల శివ 3 లక్షలు విరాళాలు ఇచ్చారు.

ఇక ఇప్పుడు యాంగ్రీ యంగ్ మన్ డాక్టర్ రాజశేఖర్ కూడా తిత్లీ బాధితుల కోసం 10 లక్షల విరాళాన్ని అందించారు. ఏపి సిఎం చంద్రబాబు నాయుడికి 10 లక్షల చెక్ అందించడం జరిగింది. కొన్నాళ్లు కెరియర్ లో వెనుకపడ్డ రాజశేఖర్ పిఎస్వి గరుడవేగ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం తన తర్వాత సినిమా ప్రయత్నాల్లో ఉన్న రాజశేఖర్ త్వరలోనే సినిమా మొదలుపెడతారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news