సినిమా ప్రేమికులకు శుభవార్త : రేపటి నుంచి ఏపీ థియేటర్లలో 100 శాతం ఆక్సుపెన్సీ

-

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా థియేటర్ల లో ఆక్యుపెన్సీని వంద శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది జగన్‌ ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని రేపటి నుంచి అంటే అక్టోబర్‌ 14 వ తేదీ నుంచే అమలు చేయనుంది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే.. కర్ఫ్యూ సమయంలో నూ కీలక నిర్ణయం తీసుకుంది జగన్‌ సర్కార్‌.

అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటలకు కర్ఫ్యూ సమయంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ సర్కార్‌. ఇక ఏపీస సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం తో… రేపటి నుంచి విడుదల కాబోయే సినిమా భారీ ఊరట లభించనుంది. రేపు మహా సముద్రం, ఎల్లుండి మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అలాగే.. పెళ్లి సందD సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news