రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, ఆటో ఢీ కొనడం తో 12 మంది మృతి..!

-

ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదం వివరాలను చూస్తే షాజహాన్ పూర్ జిల్లాలో గురువారం ఉదయం 11 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అల్లాగంజి ప్రాంతంలోని సుగిసుగి మలుపు దగ్గర ట్రక్కు ఢీకొనడంతో టెంపో లో ప్రయాణిస్తున్న 12 మంది మృతి చెందారు. టెంపో నడుపుతున్న వాళ్ళు మదనాపూర్లో దంగడ గ్రామానికి చెందిన వాళ్ళని తెలుస్తోంది. వీళ్లంతా పూస్పూర్ణిమ రోజున గంగా స్నానం చేయడానికి ఫరూఖాబాద్ లోని ఘటియా ఘాట్ లో పంచల్ ఘాట్ కి వెళ్తున్నారు.

పొగ మంచు ఎక్కువగా ఉండడం వలన వస్తున్న లారీ ఆటో ని కొట్టింది ఆటో ట్రక్కు లో ఇరుక్కుంది తర్వాత డ్రైవర్ లారీని వెనక్కి తీసుకెళ్లడంతో మళ్ళీ ట్రక్కు టెంపోపై ఎక్కింది దీంతో గాయపడిన వాళ్ళు అక్కడికక్కడే చనిపోయారు. ఈ రోడ్డు ప్రమాదమప్పుడు భారీగా అరుపులు వినపడడంతో లారీ డ్రైవర్ భయపడి పారిపోయాడు. క్షతగాత్రుల్ని తరలించే ప్రయత్నం చేసినా కూడా అప్పటికే అందరూ చనిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news