1358 టీచర్‌ పోస్టులు కి నోటిఫికేషన్‌ అవుట్… పూర్తి వివరాలు ఇవే..!

-

మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లోని ఏపీఎస్‌ఎస్‌ నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో కాంట్రాక్ట్ విధానంలో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ని రిలీజ్ చేసారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు చూస్తే.. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ ఈ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1358 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మహిళా అభ్యర్థులు జూన్‌ 4వ తేదీ లోగా అప్లై చెయ్యవచ్చు. ఇక ఖాళీల వివరాలు చూస్తే… ప్రిన్సిపాల్: 92, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ): 846, సీఆర్‌టీ: 374, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌(పీఈటీ): 46. ఇక అర్హత వివరాలు చూస్తే.. ప్రిన్సిపాల్‌ పోస్టు కి కనీసం 50శాతం మార్కులతో బీఈడీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ) కి బీఈడీ, బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ/ ఎంబీబీఎస్‌/ పీజీ డిప్లొమా/ ఎంఏ/ ఎంకామ్‌/ ఎంఎస్సీ/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి. అలానే సీఆర్‌టీ పోస్టులకి బీఈడీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

అండర్‌ గ్రాడ్యుయేషన్ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌/ బీపీఈడీ/ ఎంపీఈడీ, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత పొందినవాళ్లు పీఈటీ పోస్టులకి దరఖాస్తు చెయ్యచ్చు. అభ్యర్థుల వయస్సు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, బీఈడీ, సర్వీస్‌ వెయిటీజీ, స్కిల్‌టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.100. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరితేది జూన్‌ 4, 2023. పూర్తి వివరాలకు http://apkgbv.apcfss.in/ ని సందర్శించండి.

Read more RELATED
Recommended to you

Latest news