వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఇవాళ్టికి నాలుగేళ్లు

-

వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నేటికి నాలుగేళ్లు విజయవంతంగా పూర్తి అయింది. ఈ తరుణంలోనే.. మరి కాసేపట్లో వైసీపీ సెంట్రల్ ఆఫీసులో నాలుగేళ్ళ సంబరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు సజ్జల. ఇక ఈ కార్యక్రమానికి సజ్జల, మంత్రులు, ఇతర నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్నారు.

అన్న దానం, వస్త్రదానం వంటి పలు స్వచ్ఛంద కార్యక్రమాలు ఈ సందర్భంగా చేపట్టనున్నారు వైసీపీ పార్టీ శ్రేణులు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఇవాళ్టికి నాలుగేళ్లు అయింది. సరిగ్గా మే 30, 2019న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్.. ఏపీలో అధికారాన్ని స్వీకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు.. ఎక్కడా తగ్గకుండా.. దూసుకుపోతున్నారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news