చక్రాల కింద నలిగిపోయిన 18 నెలల చిన్నారి..!

-

రోడ్డు ప్రమాదంలో చాల ప్రాణాలు కోల్పోతున్నారు. నిద్ర మత్తులో, మద్యం మత్తులో, అతి వేగంతో ఇలా చాల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది. కారు ముందున్న చిన్నారిని చూసుకోకుండా బండి తోలడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. నిజామాబాద్ జిల్లాలోని కంటేశ్వర్ ప్రాంతం శివం అపార్ట్ మెంట్ ‌లో ఆదివారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

accident
accident

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో నివాసముంటున్నాడు. అపార్ట్‌మెంట్‌ కింద సెల్లారులో వాహనాలు నిలుపుతారు. ఎప్పటిమాదిరిగానే 18 నెలల చిన్నారి మనస్వి తమ ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. ఆదివారం పాప పార్క్‌ చేసి ఉన్న కార్ల వద్దకు వెళ్లింది. అయితే అంతలోనే ఓ వ్యక్తి తన కారును స్టార్ట్‌ చేసుకుని ముందుకు వెళ్ళింది. దింతో చక్రాల కింద నలిగి మనస్వి విగతజీవిగా మారింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news