ఓటీటీలోకి ’18 పేజెస్’..స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే !

-

కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ హీరోగా రూపొందిన కొత్త సినిమా 18 పేజెస్‌. మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ సమర్పరణలో.. జియో 2 పిక్చర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌ లపై.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్‌ 23న రిలీజ్‌ అయి.. మంచి విజయాన్నిఅందుకుంది. అయితే, తాజాగా ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ ఫాంను ఫిక్స్‌ చేసుకుంది. ఆహాలో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. అయితే, ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ను మాత్రం ప్రకటించలేదు. త్వరలోనే ఈ డేట్‌ ను కూడా అనౌన్స్‌ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news