హైదరాబాద్‌ ప్రయాణికులకు షాక్‌..నేడు 19 ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు

-

హైదరాబాద్‌ వాసులకు దక్షిణ మధ్య రైల్వే మరో షాక్‌ ఇచ్చింది. ఇవాళ కూడా పలు ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గ్రేటర్‌లో తిరిగే ఎంఎంటీఎస్లలో 19 సర్వీసులను నేడు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

అలాగే హైదరాబాద్ – లింగంపల్లి మధ్య 47108 నంబరుతో నడిచే రైలును ఉదయం 10.55కి బదులు మధ్యాహ్నం 12.30 గంటలకు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు. దీంతో హైదరాబాద్‌ లోని ప్రయాణికులు.. ఇతర రైల్వేలను, బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news