దారుణం : భారీ అగ్నిప్రమాదం, ఆర్పడానికి వెళ్ళిన ఫైర్ సిబ్బంది మృతి

-

తమిళనాడులో ఘోరం జరిగింది. అక్కడ ఒక భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ అగ్ని ప్రమాదంలో మంటలు ఆర్పేందుకు వెళ్ళిన ఇద్దరు ఫైర్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మదురైలోని సౌత్ మాసి రోడ్‌లోని ఒక వస్త్ర దుకాణంలో నిన్న అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. కొద్దిసేపటి తరువాత మంటలు వేగంగా వ్యాపించి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఇది తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.

అప్పుడు, భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బంది శివరాజన్, కృష్ణమూర్తి శిథిలావస్థలో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కానీ ఇద్దరూ చికిత్స పొందుతూ మరణించారు. ఈ వస్త్ర దుకాణం ఉన్న భవనం చాలా పాతదని, మంటలు చెలరేగడంతో భవనం కూలిపోయి, ప్రాణనష్టం జరిగిందని చెబుతున్నారు. ఏదేమైనా ఇద్దరు ఫైర్ ఫైటర్స్ ఇలా మరణించడం, అది కూడా పండుగ పూట అంటే చాలా బాధ కలిగించే అంశం అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news