‘త్రీ రోజెస్’ ట్రైలర్ రిలీజ్ చేసిన రకుల్.. హాట్ అందాలు మాములుగా లేవుగా !

-

తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కోసం మారుతీ త్రీ రోజేస్‌ పేరుతో ఓ వెబ్‌ సీరిస్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. భలే భలే మగాడివోయ్‌, ప్రతి రోజూ పండగే, మహానుభావుడు, లాంటి మంచి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు మారుతి ఈ సిరీస్‌ ను షో రన్నర్‌ గా చేస్తున్నారు. ఇందులో టైటిల్‌ రోల్‌ ను పూర్ణ, ఇసారెబ్బ, పాయల్‌ రాజ్‌ పుత్‌ పోషిస్తున్నారు.

డిజిటల్‌ మాధ్యమంలో ముగ్గురు హీరోయిన్స్‌ నటిస్తోన్న తొలి వెబ్‌ సిరీస్‌ ఇదే. రవి నంబూరి రాసిన ఈ సిరీస్‌ ను మ్యాగీ డైరెక్ట్‌ చేశారు. టాక్సీవాలా సినిమా ను నిర్మించిన ఎస్‌కెఎన్‌ యాక్షన్‌ కట్‌ మూవీస్‌ ఎల్‌ఎల్‌ పీ బ్యానర్‌ పై 3 రోజెస్‌ వెబ్‌ సీరిస్‌ ను నిర్మిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ ను టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ రిలీజ్‌ చేశారు. ఇక ట్రైలర్‌ లో ముగ్గురు హీరోయిన్లు… తన అందాలను ఆరబోశారు. ముఖ్యంగా ఆర్‌ఎక్స్‌ భామ పాయల్‌ రచ్చ చేసింది ఈ ట్రైలర్‌ లో. అలాగే ప్రొడక్షన్‌ విషయంలోనూ ఎక్కడ రాజీ పడలేదు చిత్ర బృందం.కాగా.. ఈ వెబ్‌ సిరీస్‌ నవంబర్‌ 12 న ఆహాలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news