ఏపీలో నేడు కొత్త‌గా 30 క‌రోనా కేసులు.. 500 లోపే యాక్టివ్ కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి రోజు రోజుకు క్ర‌మంగా త‌గ్గుంది. ప్ర‌తి రోజు.. క్రింద‌టి రోజు కంటే.. త‌క్కువ కేసులు న‌మోదు అవుతున్నాయి. కాగ ఈ రోజు క‌రోనా వైర‌స్ రిపోర్ట్ ను ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కేవ‌లం 30 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 23,19,297 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

కాగ నేడు రాష్ట్ర వ్యాప్తంగా 51 మంది క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో నేటి వ‌ర‌కు 23,04,082 మంది క‌రోనా వైర‌స్ బాధితులు కోలుకున్నారు. కాగ ప్ర‌స్తుతం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో 500 లోపే యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేవ‌లం 485 యాక్టివ్ కేసులు ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఉన్నాయి. కాగ ఈ రోజు కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ లో క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. కాగ గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10,529 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news