త్వరలో తెలంగాణ ఆర్టీసీకి 300 ఎలక్ట్రిక్‌ బస్సులు

-

త్వరలో తెలంగాణ ఆర్టీసీకి 300 ఎలక్ట్రిక్‌ బస్సులు రానున్నాయని ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి ప్రకటన చేశారు. తెలంగాణ ఆర్టీసీలో మరిన్ని సంస్కరణలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.  సీఎం కేసీఆర్‌ సహాయంతో 2022 -23 ఆర్థిక సంవత్సరంలో అన్ని డిపోలను లాభాల బాటల్లోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు.

ఏడాదిలో చేపట్టిన సంస్కరణలతో పాటు భవిష్యత్‌ లో అమలు చేయబోతున్న నిర్ణయాలు వెల్లడించారు ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి. త్వరలో కొత్త బస్సులను కొనుగోలు చేయబోతున్నామని స్పష్టం చేశారు చైర్మన్ బాజిరెడ్డి. డిపో లను ఎత్తి వేసే ఆలోచన లేదని… ఆర్టీసీ లో కార్మికులను వేధింపులకు పాల్పదినట్లు దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు చైర్మన్ బాజిరెడ్డి. ఆర్టీసీని ప్రైవేటీకరణ అసలు చేయబోమని క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news