మునుగోడులో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన 300 మంది యువకులు

-

మునుగోడు, ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ పార్టీ లో భారీగా చేరికయ్యారు యువకులు. టీఆరెస్, సీపీఐ, సీపీఎం నుంచి కాంగ్రెస్ లో చేరారు 300 మంది యువకులు. వీరిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలకు ఎంతో గౌరవం ఉండేదని.. టీఆరెస్, బీజేపీ అధికారంలోకి వచ్చాక స్థానిక నాయకులంటే పైరవీకారులన్న ముద్ర పడిందన్నారు.

ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో టీఆరెస్, బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల కోసం రోజుకో పంచాయితీ తీసుకొస్తున్నాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పేదలు బతకలేని పరిస్థితి నెలకొందన్నారు. మునుగోడులో కాంగ్రెస్ గెలుపుకు యువత కృషి చేయాలని అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అనే ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news