ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..!

-

గుంటూరు జిల్లాలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. తిమ్మపురం వద్ద జాతీయ రహదారిపై నుంచి విజయవాడవైపు వెళ్తన్న కారును వెనుక నుంచి వచ్చిన కంటైనర్‌ లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారులో ఉన్న నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు.

వీరి పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులను అత్తులూరి బలరాం(25), ఫిరో అహ్మద్‌(35), వింజమూరి హరికృష్ణ(26), మేడసాని వెంకట శ్రీచందు(25)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news