మాస్క్ ధరించని 67వేల మందిపై కేసు..!

-

తెలంగాణలో కరోనా తీవ్రత చాలా అధికంగా ఉంది. ప్రజలు గజగజలాడిపోతున్నారు. ప్రభుత్వాలు సైతం మాస్క్ మన జీవితంలో ఒక భాగమని తేల్చి చెప్పేసాయి. మాస్క్, శానిటైజర్ లేకుండా బయటకి అడుగుపెట్టలేక పోతున్నారు. అయితే కొంత మంది మాత్రం ఇంకా నిర్లక్ష్యం గానే ప్రవర్తిస్తున్నారు. ముఖానికి మాస్క్ లేకుండా బయట తిరుగుతూ.. ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇలా ముఖానికి మాస్కులు ధరించకుండా తిరుగుతున్న 67,557 మందిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

అలాగే మరో 3,288 మందికి ఈ-చలానాలు జారీ చేసినట్టు వెల్లడించారు. 22 మార్చి-30 జూన్ మధ్య ఈ కేసులు నమోదైనట్టు తెలిపారు. హైదరాబాద్ లో 14,931 కేసులు, రామగుండం 8,290, ఖమ్మం 6,372, సూర్యాపేట 4,213, వరంగల్‌ 3,907, భూపాలపల్లి 173 కేసులు నమోదైనట్టు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news