తెలంగాణలో దారుణం : 60 కోతుల్ని చంపి సంచిలో కట్టిపడేశారు !

-

మనుషుల్లో మానవత్వం లాంటివి మాయం అవుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే మనుషుల్లో రాక్షసులు నిద్ర లేస్తున్నారు. అయితే ఆ రాక్షసత్వాన్ని నోరు లేని మూగ జీవుల మీద చూపిస్తూ తమ శాడిజం చూపిస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శనిగపురం అనే గ్రామంలో కోతులపై విషప్రయోగం చేసి 60 కోతులను చంపేశారు దుండగులు. మృతి చెందిన కోతులను బస్తా సంచులలో కుక్కి శనిగపురం గుట్టలలో పడేశారు దుండగులు.

గోనె సంచులలో మృతి చెందిన దాదాపు అరవై కోతులను వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ విషయం మీద సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఇది ఎవరు చేశారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అన్ని కోతులను ఒక్క సారి చంపడం అనే మామూలు విషయం కాదు. ఎంతో దుర్మార్గులు అయితే తప్ప అలా చేసేందుకు మనసు రాదు. సో ఈ ఘటనకు కారణం ఎవరు అనే దాని మీద దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news