అనకాపల్లి జిల్లాలో విషాదం.. బీచ్ లో 7 గురు విద్యార్థుల గల్లంతు

-

అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అనకాపల్లి పూడి మడక బీచ్ లో 7 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు అయ్యారు. జగదీష్.. గోపాలపట్నం, జశ్వంత్.. నర్సీపట్నం, సతీష్..గుంటూరు, గణేష్.. చూచుకొండ, చందు.. ఎలమంచలి అనే విద్యార్థులు గల్లంతు అయ్యారు. మునగపాక కు చెందిన సూరిశెట్టి తేజ పరిస్థితి విషమంగా ఉంది. అత్యవసర చికిత్స నిమిత్తం విశాఖ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు కు తరలించారు పోలీసులు. ఇక పవన్ అనే విద్యార్థి మృతి రాత్రి మరణించాడు.

గల్లంతు అయిన విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతోంది. హెలికాప్టర్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. నిన్న మధ్యాహ్నం కొంతమంది విద్యార్థులు పూడిమడక బీచ్కు వచ్చారని.. సాయంత్రం 4:00 సమయంలో సముద్రానికి ఆనుకుని ఉన్న రాళ్లు పైకి ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా వెనక నుండి ఓ కెరటం వారిని కొట్టిందన్నారు పూడిమడక గ్రామ మత్స్యకారులు. అందులో 7 గురు విద్యార్థులు చెల్లా చెదురుగా గల్లంతయ్యారని.. వారిలో ఒకరిని సురక్షితంగా రక్షించామని తెలిపారు. ఇంకొక విద్యార్థి అప్పటికే నీరు ఎక్కువగా తాగి చనిపోయాడని స్పస్టం చేశారు పూడిమడక గ్రామ మత్స్యకారులు.

Read more RELATED
Recommended to you

Latest news