కమిషనర్​ను సస్పెండ్​ చేయండి.. ఉద్యోగులకు షోకాజ్​ నోటీసులపై కేటీఆర్​ సీరియస్​

-

తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పుట్టినరోజు జులై 24 వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. ప్రతియేడు ఘనంగా తెరాస కార్యకర్తలు, అభిమానుల మధ్య వేడుకలు జరుపుకునే మంత్రి.. ఈ ఏడాది వర్షాలు బీభత్సం సృష్టించి ప్రజలు ఇబ్బంది పడుతున్నందున వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.

దీంతో టీఆర్‌ఎస్‌ నేతలు తమ తమ నియోజక వర్గాల్లోనే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ బర్త్‌ డే వేడుకలకు హాజరు కాలేదంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపలి మున్సిపల్‌ కార్యాలయంలోని ముగ్గురు ఉద్యోగులకు ఉన్నతాధికారులు షోకాజ్‌ నోటీసులు ఇచ్చిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

అయితే.. దీనిపై తాజాగా మంత్రి కేటీఆర్‌ యాక్షన్‌ తీసుకున్నారు. బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయమని సీడీఎంఏకు కేటిఆర్ ఆదేశాలు జారీ చేశారు. బర్త్ డే రోజు వేడుకలకు హాజరు కాలేదని ముగ్గురు సిబ్బందికి మేమేలు జారీ చేయడంపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news