బిగ్ బ్రేకింగ్ : 80 మంది మెట్రో కార్మికులకు కరోనా..!

-

బెంగళూరు మెట్రో ఫేజ్-2 పనులు చేస్తున్న 80 మంది కార్మికులకు కరోనా నిర్ధారణ అవడంతో అధికారుల్లో ఒక్కసారి ఆందోళన మొదలైంది. మెట్రో కార్మికుల్లో ఒకరికి లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మెట్రో పనులు చేస్తున్న మరో 200 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 80 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వీరంద‌రిని కొవిడ్ కేర్ సెంట‌ర్ కు త‌ర‌లించామ‌ని చెప్పారు.

దీంతో బెంగ‌ళూరు మెట్రో ఫేజ్-2 ప‌నుల‌ను నిలిపివేశారు. మిగ‌తా కార్మికులంద‌రూ క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అధికారులు సూచించారు. క‌ర్ణాట‌క‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 41,581 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 759 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 24,569 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 16,249 మంది ఈ వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news