నమ్మకంగా మందు తాగుదాం అని పిలిచి మూడు రోజుల్లో ముగ్గురిని చంపేసాడు…!

-

గురుగ్రామ్‌ లో గత వారం వరుసగా మూడు రాత్రుల్లో ముగ్గురు వ్యక్తులను హత్య చేసిన కేసులో 22 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. అతని హత్యలు చూసి పోలీసులు కూడా భయపడ్డారు. బీహార్ నివాసి మహ్మద్ రాజిగా అతనిని పోలీసులు గుర్తించగా అతను చాలా దారుణంగా హత్యలు చేసాడు అని పోలీసులు తెలిపారు. మద్యం తాగడానికి పిలుస్తాడని పిలిచిన తర్వాత పొడిచి చంపేస్తాడు అని పోలీసులు పేర్కొన్నారు.

murder
murder

నవంబర్ 23 న గురుగ్రామ్ యొక్క లీజర్ వ్యాలీ పార్కులో నిందితుడు ఒక వ్యక్తిని పొడిచి చంపాడని, మరుసటి రోజు నవంబర్ 24 న నిందితుడు మరో హత్యకు పాల్పడ్డాడు – గురుగ్రామ్ సెక్టార్ 40 లో సెక్యూరిటీ గార్డును పొడిచి చంపాడు. నవంబర్ 25 న మూడవ హత్యకు పాల్పడ్డాడు. గురుగ్రామ్‌ లోని ఇఫ్కో చౌక్ సమీపంలో గురువారం అతన్ని అరెస్టు చేశారు. నవంబర్ 23, 24 మరియు 25 తేదీలలో తాను మూడు హత్యలు చేశానని నిందితుడు రాజి అంగీకరించాడని పోలీసులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news