మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడిపై కేసు నమోదు

-

తూర్పుగోదావరి మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడిపై కేసు నమోదయింది. మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడు శ్రీ రాజ్ పై కోరుకొండ పోలీస్ స్టేషన్ లో 509, 354 డీ సెక్షన్ల కింద కేసు నమోదయింది. ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఈ కేసు నమోదయిందింది. యువతి ఫిర్యాదుతో శ్రీ రాజ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గాడాలా గ్రామానికి సంబంధించిన ఓ యువతిపై అసభ్యంగా ప్రవర్తించాడని..బాధిత యువతి ఫిర్యాదు చేసింది. రాజమండ్రిలోని ఓ హోటల్ దగ్గర శ్రీ రాజ్ అమ్మాయికి ముద్దు పెట్టడానికి యత్నించాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ ఘటనపై శ్రీ రాజ్ మాత్రం ఇంకా స్పందించలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news