తెలంగాణలో పరువు హత్య.. ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడి హత్య

-

తెలంగాణలో పరువు హత్య జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిని హత్య చేశారు. ఈ సంఘట మేడ్చల్‌ లోని దూలపల్లి లో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకున్ని ఆ యువతి బంధువులు చంపేశారు. యువతీ ముందే హరీష్ ని కిరాతకంగా కొట్టి చంపారు బంధువులు.

ఆరు నెలల క్రితం యువతిని ప్రేమ వివాహం చేసుకున్న హరీష్.. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకొని హైదరాబాద్ వచ్చిడు. ఆరు నెలలుగా దూలపల్లిలో కాపురం పెట్టాడు హరీష్. అయితే, హరీష్ నివాసం ఉంటున్న ప్రాంతానికి వచ్చి, యువతి ముందే నరికివేశారు ఆ యువతి కుటుంబ సభ్యులు. ఇక ఈ కేసును పరువు హత్య గా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులో ఒకరు పోలీసులకు పట్టుపడ్డాడు.

Read more RELATED
Recommended to you

Latest news