పిల్లల భవిష్యత్ కోసం అద్భుతమైన పాలసీ.. రోజుకు రూ.150 ఇన్వెస్ట్ చేస్తే రూ.19 లక్షలు మీ సొంతం..!

-

ఈరోజుల్లో డబ్బులను పొదుపు చెయ్యడం పై జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.. ముఖ్యంగా పిల్లల గురించి వారి భవిష్యత్ గురించి బాగా ప్లాన్ చేస్తున్నారు..అందులో భాగంగా చాలామంది ఎల్‌ఐసీ పాలసీలని తీసుకుంటున్నారు. ఆదాయంలో కొంత శాతాన్ని పొదుపు చేస్తే పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఇందుకోసం ఎల్‌ఐసీ ఒక గొప్ప పథకాన్ని అందిస్తోంది. కొత్త చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ పథకం ద్వారా పిల్లల భవిష్యత్‌కి భరోసాని కల్పిస్తోంది..ఈ పథకం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజే ఎల్‌ఐసీ కొత్త చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్‌లో చేరవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్‌లో పిల్లలని ధనవంతులు చేయవచ్చు. దీని కోసం మీరు ప్రతిరోజూ 150 రూపాయలు ఆదా చేస్తే సరిపోతుంది. చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ పాలసీ 25 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అలాగే మీరు మెచ్యూరిటీ మొత్తాన్ని వాయిదాలలో పొందుతారు. మీ బిడ్డకు 18 సంవత్సరాలు నిండినప్పుడు మొదటి వాయిదా చెల్లిస్తారు. రెండోసారి బిడ్డకు 20 ఏళ్లు వచ్చినప్పుడు, మూడోసారి 22 ఏళ్లు వచ్చినప్పుడు రెండు వాయిదాలు చెల్లిస్తారు. అదే విధంగా ట్యాక్స్ బ్యాక్, బోనస్ లను కూడా పొందవచ్చు..

ఇకపోతే మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రారంభించిన ఈ బీమా వాయిదా సంవత్సరానికి రూ.55,000 అవుతుంది. 25 ఏళ్లలో మొత్తం 14 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. అదే సమయంలో మీరు మెచ్యూరిటీపై మొత్తం 19 లక్షల రూపాయలు పొందుతారు. అయితే ఈ వ్యవధిలో బీమా చేసిన వ్యక్తి చనిపోకపోతే మాత్రమే ఈ నియమం వర్తిస్తుందని గుర్తుంచుకోండి..కాగా, ఒకవేళ మీరు డబ్బులను విత్ డ్రా చెయ్యకూడదు అనుకుంటే మీరు డబ్బును విత్‌డ్రా చేయకూడదనుకుంటే మెచ్యూరిటీపై వడ్డీతో పాటు మొత్తం డబ్బులను చెల్లిస్తారు..

Read more RELATED
Recommended to you

Latest news