మహిళతో సహజీవనం…ఏఆర్ ఎస్.ఐకి దేహశుద్ధి

-

నెల్లూరు లోని పోస్టల్ కాలనీలో ఏఆర్ ఎస్.ఐ. వాసు కు దేహశుద్ధి చేశారు. ఓ మహిళతో సహజీవనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దేహశుద్ధి చేశారు అతని మొదటి భార్య సామ్రాజ్యం , ఆమె కుటుంబ సభ్యులు. గత కొన్నేళ్లుగా మొదటి భార్య , పిల్లలకు దూరంగా ఉంటున్నాడు వాసు. అయితే.. వాసు,సామ్రాజ్యంకు 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

భార్య, భర్తలు ఇద్దరిదీ గుంటూరు. వీరికి ఇద్దరు పిల్లలు అంటే.. కొడుకు, కూతురు ఉన్నారు. 2017 నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. 2018లో తన భర్త మౌనిక అనే మహిళను వివాహం చేసుకున్నాడని మొదటి భార్య ఆరోపణలు చేస్తోంది. ఇక తాజాగా ఓ మహిళతో సహజీవనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దేహశుద్ధి చేశారు అతని మొదటి భార్య సామ్రాజ్యం , ఆమె కుటుంబ సభ్యులు. తన భర్త తనకు కావాలని భార్య డిమాండ్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news