సీఎం కేసీఆర్ కి డబుల్ బెడ్ రూం అక్కడ కట్టిస్తా.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

-

సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం దుబ్బాకలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. కాంగ్రెస్ వాళ్లు గుంపులు గుంపులుగా వస్తున్నారని కేసీఆర్ అంటున్నారు. తాను బక్కోడిని అని సీఎం అంటున్నారని.. కేసీఆర్ బక్కోు కాదని బకాసురుడు అన్నారు. ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడిని అంటూ విరుచుకుపడ్డారు. మంత్రి హరీశ్ రావు దుబ్బాక నిధులను సిద్ధిపేటకు తరలిస్తున్నారని సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్రం నుంచి నిధులు తెస్తా.. అది చేస్తా ఇది చేస్తా అని హామీలు ఇచ్చి ఏమీ చేయలేదన్నారు.

దుబ్బాకను బంగారు తునక చేస్తానన్న కేసీఆర్.. హరీశ్ రావు బొందలగడ్డ చేశారన్నారు. సీఎం కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తామన్నారు. దుబ్బాక అభివృద్ధి పథంపై నడవాలంటే.. డిసెంబర్ 30న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news