Breaking News : రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు

-

షాద్ నగర్ పరిధిలోని అల్వీన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 50 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద చోటుచేసుకుంది.

నందిగామలో ఉన్న ఆల్విన్ ఫార్మా కంపెనీలో ఉన్నట్టుండి శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఘటన జరిగిన సమయంలో మొత్తం 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో కొందరు కిటికీలోంచి దూకి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంకా చాలా మంది కార్మికులు పరిశ్రమ లోపల మంటల్లో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మంటలను ఆర్పేందుకు 2 ఫైర్ ఇంజన్లతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటల్లోంచి  నలుగురు వ్యక్తులు బిల్డింగ్ పై నుంచి దూకారు.

Read more RELATED
Recommended to you

Latest news