కరీంనగర్‌ లో మరో ప్రమాదం..ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

-

ఉమ్మడి కరీంనగర్‌ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామగుండం క్రషర్ నగర్ సమీపంలో ఏకంగా ఇంట్లోకి ఓ టిప్పర్‌ లారీ అదుపు తప్పి దూసుకెళ్లింది. దీంతో ఇంట్లో ఉన్న దంపతుల చేతులు, తలకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఇక ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తం అయ్యారు. దీంతో.. గాయపడిన ఆ దంపతులను రామగుండంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థానికులు.

ఇక సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ రోడ్డు ప్రమాదం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ రోడ్డు ప్రమాదానికి లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమే కారణంగా భావిస్తున్నారు పోలీసులు. అటు టిప్పర్‌ లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా.. నిన్న కరీంనగర్‌ కమాన్‌ దగ్గగర జరిగిన రోడ్డు ప్రమాదంలో.. నలుగురు మహిళలు మరణించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news