విపక్షాలు విసిరే బురదలోనూ కమలం వికసిస్తుంది – ప్రధాని మోదీ

-

విపక్షాలు విసిరే బురదలోను కమలం వికసిస్తుందని అన్నారు ప్రధాని మోదీ. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానంగా ప్రసంగించిన ప్రధాని మోదీ ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన శుద్ధ దండగ అని పేర్కొన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిరాకరిస్తున్నారని తెలిపారు. కొందరు ఎంపీల ప్రవర్తన బాధ కలిగిస్తుందన్నారు.

గత కాంగ్రెస్ పాలనను ఎండగడుతూనే ప్రతిపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ప్రగతి అవకాశాలను కాంగ్రెస్ నాశనం చేసిందని మండిపడ్డారు. 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ గుంతలను మాత్రమే తవ్విందని ఎద్దేవా చేశారు. తాము మాత్రం పాలనతో ప్రజల మనసులను గెలుచుకున్నామని, రాజకీయాలతో కాదని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతోందన్నారు. విపక్షం ఆఖరికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా దెబ్బతీసే ప్రయత్నం చేసిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news