బ్రేకింగ్‌ : ”జై తెలంగాణ” అంటూ రాజ్‌ భవన్‌ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం !

-

టీఆర్‌ఎస్‌ పార్టీ మహా ధర్నా లో ఓ అప శ్రుతి చోటు చేసుకుంది. ఇందిరా పార్క్‌ లో మహా ధర్నా అనంతరం… టీఆర్‌ఎస్‌ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు… రాజ్‌ భవన్‌ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజ్‌ భవన్‌ లో తెలంగాణ గవర్నర్‌ కు తమిళ్‌ సై కి వినతి పత్రం ఇచ్చారు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు.

అయితే.. ఈ నేపథ్యంలోనే… రాజ్ భవన్‌ ముందు ఓ యువకుడ ఆత్మహత్య యత్నం చేసుకునే ప్రయత్నం చేశాడు. జై తెలంగాణ అంటూ రాజ్‌ భవన్‌ ముందు ఆ యువకుడు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అయితే.. అక్కడే ఉన్న రాజ్‌ భవన్‌ పోలీసులు.. ఆ యువకున్ని అదుపులోకి తీసుకున్నారు. పెట్రోల్‌ డబ్బాను తీసుకుని… అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ యువకునికి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఆ యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news