టాలీవుడ్ ను కదిలిస్తున్న ఓ నిర్మాత లెటర్..

-

నిర్మాత అంటేనే సినిమాని ముందు ఉండి నడిపించే వ్యక్తి సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన నిర్మాత జీవితం మారిపోతుంది ఒకప్పుడు సినిమా అంటే వంద రోజులు ఆడాలి అన్నట్టు ఉండేది కానీ ఈ రోజుల్లో ఏ సినిమా టాక్ అయినా విడుదల అవ్వగానే క్షణాల్లో తెలిసిపోతుంది సోషల్ మీడియా వేదికగా క్షణాల్లో న్యూస్ వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఈ శుక్రవారం టాలీవుడ్లో 15 సినిమాలు విడుదలవుతున్నాయి ఈ సందర్భంగా ఓ నిర్మాత రాసిన లెటర్ ప్రస్తుతం వైరల్ గా మారింది..

సినిమా ఎలా ఉంది అనే విషయం క్షణాల్లో తేలిపోతుంది విడుదలైన మొదటి రోజు ఫస్ట్ షో వరకు కూడా ఆగాల్సిన అవసరం లేకుండా పోతుంది ఒకవేళ ఆ సినిమా పైన నెగెటివ్ టాక్ వస్తే నిర్మాత తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒకే రోజు రెండు మూడు సినిమాలు విడుదల అయితేనే నిర్మాతలకు నిద్ర పట్టదు అలాంటిది రేపు ఒక్క రోజే 15 సినిమాలు విడుదలవుతున్న సందర్భంగా పంచతంత్రం నిర్మాత ఓ లెటర్ ను విడుదల చేశారు ప్రస్తుతం ఈ లెటర్ టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాన్ని కదిలిస్తుంది..

రేపు రిలీజ్ కాబోయే చిత్రాల్లో పంచతంత్రం కూడా ఒకటి.. ఈ సందర్భంగా ఆ సినిమా ప్రొడ్యూసర్ రాసిన ఓ లెటర్ లో ఏముందంటే… ‘18 నెలల సుదీర్ఘ నిరీక్ష తర్వాత మా సినిమాను మీ అభిమాన థియేటర్లకి తీసుకొస్తున్నాం. ఎన్నో ఏళ్ల మా కలను మీ ముందు పెడుతున్నాం. తప్పకుండా చూడండి. మా సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచింపజేస్తుంది, గుండెల్ని హత్తుకుంటుంది. ముఖ్యంగా మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాం. చిన్నప్పుడు మీ ఇంట్లో తాత చెప్పిన కథలు గుర్తుకువస్తాయి! మీరు ఖచ్చితంగా ఈ కథతో ప్రేమలో పడతారు. ఈ చక్కని అనుభూతి కోసం మీరు తప్పకుండా మా పంచతంత్రం చూడాల్సిందే. మీరు మాత్రమే ఈ సినిమాకు న్యాయం చేయగలరు.. నచ్చిన నచ్చకపోయినా మా సినిమాను తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news